ఆఖిల భారత యాదవ మహాసభ, గొర్రెల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తోపాటు, స్థానిక ఎన్నికల విజయులను సాధించిన ఖమ్మం జిల్లా యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించబడ్డారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ, యాదవ యువతకు ఐక్యత, రాజకీయ చైతన్యం కీలకం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, చేతుల నాగేశ్వరరావు, గూదే భద్రయ్య, మల్లె బోయిన శ్రీనివాస్, కనక బండి విజయలక్ష్మి, చంద్రకాని రమణ, తెల్లబోయిన రమణ, కోటేశ్వరరావు, మేకల సైదులు, బండారు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి