నారాయణఖేడ్లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
నారాయణఖేడ్లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
Krishna
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పట్టణంలోని 8వ వార్డు మనసునపూర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకరాం తో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గరగా ఉండే పాలన విధానాలు తమను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్,రహీం, గౌస్ చిస్తీ, డ్యానియల్, మైపాల్, విట్టల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ చేరికలతో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి