Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:49 PM

నారాయణఖేడ్‌లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

నారాయణఖేడ్‌లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

నారాయణఖేడ్‌లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
February 03, 2026 05:11 PM 474 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పట్టణంలోని 8వ వార్డు మనసునపూర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకరాం తో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గరగా ఉండే పాలన విధానాలు తమను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్,రహీం, గౌస్ చిస్తీ, డ్యానియల్, మైపాల్, విట్టల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ చేరికలతో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News