Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:00 PM

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
May 06, 2026 03:00 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బాల సాధన భవనాన్ని ప్రారంభించి, ప్రభుత్వం తరపున మంజూరైన దివ్యాంగుల త్రిచక్ర వాహనాలు (స్కూటీలు) లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు,దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన లక్ష్యమని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి, సంబంధించి అధికారులు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వస్పరి ప్రశాంతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News