Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్కారం మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 04:37 PM

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

నారాయణఖేడ్‌లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
May 06, 2026 03:00 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బాల సాధన భవనాన్ని ప్రారంభించి, ప్రభుత్వం తరపున మంజూరైన దివ్యాంగుల త్రిచక్ర వాహనాలు (స్కూటీలు) లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు,దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన లక్ష్యమని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి, సంబంధించి అధికారులు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వస్పరి ప్రశాంతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News