నారాయణఖేడ్లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
నారాయణఖేడ్లో బాల సాధన భవన ప్రారంభం – దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బాల సాధన భవనాన్ని ప్రారంభించి, ప్రభుత్వం తరపున మంజూరైన దివ్యాంగుల త్రిచక్ర వాహనాలు (స్కూటీలు) లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు,దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన లక్ష్యమని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి, సంబంధించి అధికారులు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వస్పరి ప్రశాంతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి