Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:05 PM

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన
June 08, 2026 07:25 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలంలోని డేగుల్‌వాడి ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా సౌకర్యాలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మెరుగైన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలపై విశ్వాసం ఉంచి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు సన్‌శెట్టి, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News