నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన
నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలంలోని డేగుల్వాడి ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా సౌకర్యాలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మెరుగైన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలపై విశ్వాసం ఉంచి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు సన్శెట్టి, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి