Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:23 PM

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన
March 26, 2026 08:39 PM 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న నాలుగు జిల్లాల కబడ్డీ పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని అన్నారు. సంప్రదాయ క్రీడలైన కబడ్డీని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతలో ఐక్యత భావనను పెంచుతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News