Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన
26-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న నాలుగు జిల్లాల కబడ్డీ పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని అన్నారు. సంప్రదాయ క్రీడలైన కబడ్డీని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతలో ఐక్యత భావనను పెంచుతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

Sthanikam

నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన

Article Image

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న నాలుగు జిల్లాల కబడ్డీ పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని అన్నారు. సంప్రదాయ క్రీడలైన కబడ్డీని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతలో ఐక్యత భావనను పెంచుతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News