నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన
నాలుగు జిల్లాల కబడ్డీ పోటీల సందర్శన
Editor Desk
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న నాలుగు జిల్లాల కబడ్డీ పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సందర్శించారు.
ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని అన్నారు. సంప్రదాయ క్రీడలైన కబడ్డీని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతలో ఐక్యత భావనను పెంచుతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి