PRINT TIME: April 11, 2026 03:22 PM
నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
January 31, 2026 10:56 AM
99 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.
ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి