Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:52 PM

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం
February 18, 2026 08:08 PM 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సొంత యంత్రంతో పనులు పూర్తి చేయించిన చైర్‌పర్సన్ – మొరిశెట్టి నివేదిత లక్షాధికి కాలనీవాసుల కృతజ్ఞతలు

నాలుగేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు కేవలం నాలుగు గంటల్లోనే ముగింపు పలికిన సంఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి స్పందనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ సమీప 17, 19 వార్డుల మధ్య ఉన్న కాలనీలో పైప్రాంతాల నుంచి వర్షపు నీరు చేరి వీధులు మునిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారి, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని కాలనీవాసులు తెలిపారు. ఎన్నికల సమయంలో కూడా సమస్యను ప్రస్తావించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్ నివేదిత లక్షాధిని కలిసి సమస్యను వివరించగా, వెంటనే స్పందించారు. మున్సిపల్ యంత్రం మరమ్మతులో ఉండటంతో, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆమె తన సొంత యంత్రాన్ని వినియోగించి పనులు ప్రారంభించించారు. రోడ్లపై నిల్వ ఉన్న నీటిని గుంతలు తవ్వి కాలువల వైపు మళ్లించే చర్యలు చేపట్టి నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న చైర్‌పర్సన్‌కు “శభాష్” అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News