Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:09 AM

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం
February 18, 2026 08:08 PM 252 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సొంత యంత్రంతో పనులు పూర్తి చేయించిన చైర్‌పర్సన్ – మొరిశెట్టి నివేదిత లక్షాధికి కాలనీవాసుల కృతజ్ఞతలు

నాలుగేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు కేవలం నాలుగు గంటల్లోనే ముగింపు పలికిన సంఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి స్పందనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ సమీప 17, 19 వార్డుల మధ్య ఉన్న కాలనీలో పైప్రాంతాల నుంచి వర్షపు నీరు చేరి వీధులు మునిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారి, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని కాలనీవాసులు తెలిపారు. ఎన్నికల సమయంలో కూడా సమస్యను ప్రస్తావించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్ నివేదిత లక్షాధిని కలిసి సమస్యను వివరించగా, వెంటనే స్పందించారు. మున్సిపల్ యంత్రం మరమ్మతులో ఉండటంతో, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆమె తన సొంత యంత్రాన్ని వినియోగించి పనులు ప్రారంభించించారు. రోడ్లపై నిల్వ ఉన్న నీటిని గుంతలు తవ్వి కాలువల వైపు మళ్లించే చర్యలు చేపట్టి నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న చైర్‌పర్సన్‌కు “శభాష్” అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News