Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ వెంకటేశం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 07:22 PM

నల్లగొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు..
March 25, 2026 05:47 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..

రూ. 30 వేల జరిమానా వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ : నల్లగొండ పట్టణంలో ఎనిమిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ (POA) చట్ట కేసుల విచారణ కోర్టు – II అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ఈ మేరకు శిక్షను ఖరారు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఘటన వివరాల్లోకి వెళ్తే.. కనగల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకురి రమేష్ (30) వ్యక్తిగత విభేదాలు, పాత గొడవల కారణంగా 2018 జనవరి 28వ తేదీ రాత్రి నల్లగొండ పట్టణంలోని భారత్ గ్యాస్ గోదాం సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు ఉదయం మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ మొసిన్ ఖాన్ (A1) విచారణ దశలో ఉండగానే మరణించగా, రెండో నిందితుడు మొహమ్మద్ దుర్వేశ్ మొహియుద్దీన్ అలియాస్ నయాబ్ (A2) పై నేరం నిరూపితమైంది.నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడికి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు సాక్ష్యాధారాల మాయం (IPC 201) కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా, అలాగే సెక్షన్ 153(A) కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయని ఎస్పీ వివరించారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కృషి చేసిన ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిల, అప్పటి దర్యాప్తు అధికారులు సబ్ ఇన్‌స్పెక్టర్ డి. మధు, సీఐలు ఎన్. వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషాలను ఎస్పీ అభినందించారు. అలాగే ప్రస్తుతం ఈ కేసును పర్యవేక్షించిన డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ ఎస్. రాఘవరావు, ఎస్ఐ వై. సైదులు, సీడీఓ సుమన్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు నరేందర్, మల్లికార్జున్‌లను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News