PRINT TIME: April 10, 2026 03:50 PM
నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
February 13, 2026 10:11 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.
వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి