Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:57 AM

నల్గొండలో ఘనంగా దావతే ఇఫ్తార్.. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండలో ఘనంగా దావతే ఇఫ్తార్.. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండలో ఘనంగా దావతే ఇఫ్తార్.. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
March 17, 2026 04:49 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్

నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్‌లోని మదీనా మసీదులో సోమవారం దావతే ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తుచేశారు. నల్గొండలో గత 30 ఏళ్లుగా హిందూ–ముస్లింలు కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటూ సౌహార్దాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మదీనా మసీదు కిరాయిదారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా కిరాయి చెల్లించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నారు. మసీదు నిర్వహణకు కిరాయిలు ఎంతో అవసరమని, వక్ఫ్ బోర్డు నియమించిన కమిటీకి కిరాయి చెల్లించాలని సూచించారు. కిరాయి చెల్లించని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డిఆర్వోలను ఆదేశించారు. అవసరమైతే అరెస్టులు చేయాలని ఎస్పీ, డీఎస్పీలకు సూచించారు.

రంజాన్ పండుగ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి, రాష్ట్ర ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News