Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతిభకు యువశక్తి ప్రోత్సాహం.. విద్యార్థినికి రూ.5 వేల నగదు బహుమతి నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 05:41 PM

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..
June 07, 2026 01:26 PM 288 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


నల్గొండ : నల్గొండ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శనివారం నుండి కనిపించకుండా పోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లాకు చెందిన గిరి శ్రీకాంత్ (44), ఆయన భార్య లక్ష్మి (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయిచరణ్ (20) ఆరు సంవత్సరాల క్రితం నల్గొండకు వలస వచ్చారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల బీటీఎస్, శ్రీనివాస కాలనీలో నివాసముంటూ, శ్రీకాంత్ దంపతులు స్థానిక కిరాణా దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, శనివారం (ఈ నెల 6వ తేదీ) నుండి ఈ నలుగురు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.

ఇల్లంతా వెతికినా, తెలిసిన వారిని విచారించినా వీరి ఆచూకీ లభించలేదు. కనిపించకుండా పోయిన ఈ కుటుంబం గురించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. ​నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 8712667670, ఎస్.ఐ. జె. సైదులు: 8712577228


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News