నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..
నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..
NM Yadav
నల్గొండ : నల్గొండ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శనివారం నుండి కనిపించకుండా పోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లాకు చెందిన గిరి శ్రీకాంత్ (44), ఆయన భార్య లక్ష్మి (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయిచరణ్ (20) ఆరు సంవత్సరాల క్రితం నల్గొండకు వలస వచ్చారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల బీటీఎస్, శ్రీనివాస కాలనీలో నివాసముంటూ, శ్రీకాంత్ దంపతులు స్థానిక కిరాణా దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, శనివారం (ఈ నెల 6వ తేదీ) నుండి ఈ నలుగురు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.
ఇల్లంతా వెతికినా, తెలిసిన వారిని విచారించినా వీరి ఆచూకీ లభించలేదు. కనిపించకుండా పోయిన ఈ కుటుంబం గురించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 8712667670, ఎస్.ఐ. జె. సైదులు: 8712577228
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి