Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ
April 06, 2026 04:28 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో IKP & PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రానికి వచ్చే ప్రతి గింజను సమయానికి కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకతతో పాటు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News