Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 06:30 PM

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ
April 06, 2026 04:28 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో IKP & PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రానికి వచ్చే ప్రతి గింజను సమయానికి కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకతతో పాటు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News