నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం
నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం
Biksham
జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు రావాలి
జర్నలిజం పేరుతో దందాలు, బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడుతున్న నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టులు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఖాజా పాషా మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిజాన్ని సేవా దృక్పథంతో చూడాలని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తులను కూడా చేపట్టాలని సూచించారు. వార్తలు సేకరించి ప్రజలకు అందించేవారే నిజమైన జర్నలిస్టులని, బ్లాక్మెయిల్కు పాల్పడేవారు జర్నలిస్టులు కాదని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల పేరుతో దాడులకు పాల్పడే ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి వారిని అరికట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నకిలీ జర్నలిస్టుల కారణంగా సమాజంలో జర్నలిస్టుల ప్రతిష్ఠ దెబ్బతింటోందని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు సరైన శిక్షణ అవసరమని, త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అసలైన జర్నలిస్టుల జాబితా రూపొందించి అధికారులకు అందజేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, జిల్లా నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి