Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:11 PM

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం
March 23, 2026 08:05 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు రావాలి

జర్నలిజం పేరుతో దందాలు, బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడుతున్న నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టులు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్‌లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఖాజా పాషా మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిజాన్ని సేవా దృక్పథంతో చూడాలని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తులను కూడా చేపట్టాలని సూచించారు. వార్తలు సేకరించి ప్రజలకు అందించేవారే నిజమైన జర్నలిస్టులని, బ్లాక్మెయిల్‌కు పాల్పడేవారు జర్నలిస్టులు కాదని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పేరుతో దాడులకు పాల్పడే ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి వారిని అరికట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నకిలీ జర్నలిస్టుల కారణంగా సమాజంలో జర్నలిస్టుల ప్రతిష్ఠ దెబ్బతింటోందని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు సరైన శిక్షణ అవసరమని, త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అసలైన జర్నలిస్టుల జాబితా రూపొందించి అధికారులకు అందజేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, జిల్లా నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News