రామన్నపేట స్థానికం ప్రతినిధి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలో నూతన సంవత్సర సందర్భంగా మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆరోగ్యం–సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్ కూడా చిరుమర్తి లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి