స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి:
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పరిటాల రవి నిరాడంబరతకు ప్రతీకగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, గీత కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ సమాజ సేవకు అంకితమై ఉన్నారని నాయకులు ప్రశంసించారు.
కష్టకాలంలో ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే వ్యక్తిగా, అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడే సేవాభావం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధి, సమాజంలో సమానత్వం–న్యాయం కోసం అంకితభావంతో పనిచేస్తూ యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడిగా పరిటాల రవి నిలుస్తున్నారని తెలిపారు.గీత కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వ శైలి ఆయనను సామాన్యుల్లో విశ్వసనీయ నేతగా నిలిపిందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి