నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం
నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం
Editor Desk
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి సహకారంతో గ్రామ మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు చర్చించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పాత రుణాలపై వడ్డీ మాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాయకులు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి