Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:17 PM

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ.  రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం
27-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో గ్రామ మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు చర్చించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పాత రుణాలపై వడ్డీ మాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాయకులు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం

Article Image

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో గ్రామ మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు చర్చించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పాత రుణాలపై వడ్డీ మాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాయకులు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News