Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ
03-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:మహిళల హక్కులు, సమానత్వం, అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్‌లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఆడబిడ్డలకు అక్షరజ్ఞానం అందించేందుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. మహిళలకు విద్య అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పుకు బాటలు వేసిన మహనీయురాలిగా ఆమెను కొనియాడారు. ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:మహిళల హక్కులు, సమానత్వం, అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్‌లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఆడబిడ్డలకు అక్షరజ్ఞానం అందించేందుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. మహిళలకు విద్య అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పుకు బాటలు వేసిన మహనీయురాలిగా ఆమెను కొనియాడారు. ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News