Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:08 AM

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ

నీలం మధు ముదిరాజ్ చిట్కులో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహణ
January 03, 2026 02:25 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:మహిళల హక్కులు, సమానత్వం, అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్‌లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఆడబిడ్డలకు అక్షరజ్ఞానం అందించేందుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. మహిళలకు విద్య అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పుకు బాటలు వేసిన మహనీయురాలిగా ఆమెను కొనియాడారు. ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News