ముత్తంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు 100% ఫలితాలు
ముత్తంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు 100% ఫలితాలు
Krishna
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ముత్తంగి గ్రామానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన మొత్తం 97 మంది విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులవగా, అందులో 60 మంది 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. పాఠశాల టాపర్గా లక్ష్మీ కీర్తన 584 మార్కులు సాధించగా, శృతి 578, శ్రీజ మరియు నివృత తలో 573, హరిత 571, వైష్ణవి 570 మార్కులతో ప్రతిభ చాటారు. అలాగే సంజన, కీర్తిక, హైందవీరెడ్డి, రాధాదేవి, భార్గవి, అమూల్య, తిని, వేదశ్రీ తదితర విద్యార్థులు కూడా మెరుగైన మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సంగాని రాజు, ప్రిన్సిపల్ చంద్రిమ్ రాజేష్ విజేత విద్యార్థులను సత్కరించి అభినందించారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని చైర్మన్ ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి