ముస్తాబైన శివాలయాలు
ముస్తాబైన శివాలయాలు
Biksham
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా పిల్లలమర్రి శివాలయం సహా అన్ని శివాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తుల రాకపోకలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
ఆదివారం జరిగే మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జపాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు సన్నాహాలు పూర్తి చేశాయి.భక్తులకు తాగునీరు, ప్రసాదం, కూర్చోవడానికి వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల కార్యక్రమాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉండటంతో ఈసారి పండుగకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.శివుని దర్శనార్థం రానున్న భక్తులతో ఆదివారం పట్టణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడనుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి