Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు
February 15, 2026 02:29 AM 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా పిల్లలమర్రి శివాలయం సహా అన్ని శివాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తుల రాకపోకలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

ఆదివారం జరిగే మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జపాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు సన్నాహాలు పూర్తి చేశాయి.భక్తులకు తాగునీరు, ప్రసాదం, కూర్చోవడానికి వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల కార్యక్రమాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉండటంతో ఈసారి పండుగకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.శివుని దర్శనార్థం రానున్న భక్తులతో ఆదివారం పట్టణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడనుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News