Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:18 PM

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు
February 15, 2026 02:29 AM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా పిల్లలమర్రి శివాలయం సహా అన్ని శివాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తుల రాకపోకలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

ఆదివారం జరిగే మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జపాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు సన్నాహాలు పూర్తి చేశాయి.భక్తులకు తాగునీరు, ప్రసాదం, కూర్చోవడానికి వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల కార్యక్రమాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉండటంతో ఈసారి పండుగకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.శివుని దర్శనార్థం రానున్న భక్తులతో ఆదివారం పట్టణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడనుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News