Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 21, 2026 11:21 PM

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి
March 21, 2026 08:59 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
ఎడిటోరియల్ టీమ్

నల్గొండ పట్టణ కేంద్రంలో ముస్లింల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

రంజాన్ పండుగ సందర్భంగా శనివారం మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింల సామూహిక ప్రార్థనల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్ నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంజాన్ విందుకు హాజరై ఆతిథ్యాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News