Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాల పంపిణీ

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాల పంపిణీ

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాల పంపిణీ
12-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : KUSHMANCHI
vemula janardhan rao

మసీదు కమిటీలకు రంజాన్ కానుకల అందజేత

ఖమ్మం జిల్లా కూసుమంచి శిబిర కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మసీదు కమిటీలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకల ప్యాకెట్లు కూడా అందజేశారు.

ఈ కార్యక్రమానికి రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మహిళలకు కుట్టు యంత్రాలను అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలేరు నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో ఈ యంత్రాలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదు కమిటీలకు కానుకల ప్యాకెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Sthanikam

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాల పంపిణీ

Article Image

మసీదు కమిటీలకు రంజాన్ కానుకల అందజేత

ఖమ్మం జిల్లా కూసుమంచి శిబిర కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మసీదు కమిటీలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకల ప్యాకెట్లు కూడా అందజేశారు.

ఈ కార్యక్రమానికి రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మహిళలకు కుట్టు యంత్రాలను అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలేరు నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో ఈ యంత్రాలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదు కమిటీలకు కానుకల ప్యాకెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News