మురుగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ చర్యలు
మురుగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ చర్యలు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్
మురుగునీటి ప్రవాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలోని అల్లాదుర్గ్ మెటల్ కుంట రోడ్డు మార్గం సమీప కాలనీ నుంచి మురుగునీరు పొలాల దారి గుండా ప్రవహిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
ఈ మురుగునీటి కారణంగా పొలాలకు వెళ్లే రైతుల రాకపోకలు కష్టతరంగా మారాయి. పొలాల్లో సాగు చేసిన దాన్యరాశులు, చెరుకును వాహనాల్లో క్రషింగ్కు తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు.
ఈ విషయాన్ని రైతులు గ్రామ సర్పంచ్ ముత్తం శెట్టి ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన సర్పంచ్ జేసీబీ సహాయంతో మురుగునీటి కాల్వను తవ్వించి దారి మళ్లించారు. దీంతో పొలాల దారిలో మురుగునీటి సమస్య తొలగి రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జహీరాబాద్ నియోజకవర్గం / హద్నూర్ గ్రామం, న్యాల్కల్ మండలం

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి