Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:45 AM

మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి

మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి

మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి
09-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో వివిధ మున్సిపల్ వార్డులలో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపల్ పట్టణంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.అప్పటి నాయకులు పట్టణంలోని ప్రధాన కాలనీలలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించకుండా కాలయాపన చేశారని పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మున్సిపల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.నీటి సరఫరా నుంచి మౌలిక వసతుల వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని అన్నారు. పట్టణంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించి, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల మద్దతుతో నారాయణఖేడ్ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో వివిధ మున్సిపల్ వార్డులలో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపల్ పట్టణంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.అప్పటి నాయకులు పట్టణంలోని ప్రధాన కాలనీలలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించకుండా కాలయాపన చేశారని పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మున్సిపల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.నీటి సరఫరా నుంచి మౌలిక వసతుల వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని అన్నారు. పట్టణంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించి, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల మద్దతుతో నారాయణఖేడ్ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News