మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి
మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి
Komidala Mahender reddy
స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యూహాల రూపకల్పన, సమన్వయ బాధ్యతలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ ఛైర్మెన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
పార్టీలో సంస్థాగత అనుభవం, ఎన్నికల నిర్వహణలో వ్యూహాత్మక దృష్టి ఉన్న నాయకుడిగా పేరుగాంచిన గుత్తా అమిత్ రెడ్డికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలన్నదే టీపీసీసీ ఉద్దేశంగా కనిపిస్తోంది. వార్ రూమ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని అంశాలను సమన్వయం చేస్తూ పార్టీని విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత అమిత్ రెడ్డిపై ఉండనుంది.
ఈ నియామకంపై పార్టీ శ్రేణుల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్, ఈ వార్ రూమ్ వ్యవస్థ ద్వారా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి