PRINT TIME: March 18, 2026 07:07 PM
మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం
మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం
March 18, 2026 04:33 PM
16 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.
అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి