మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి
మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి
Biksham
సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ అధ్యక్షులు అబీద్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముప్పై ఏడు వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
తనను ముప్పై ఏడు వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అబీద్, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతినిధిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో బీజేపీ బలపడితే పట్టణానికి సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి