మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ
మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ
Editor Desk
చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:
చిట్యాల పట్టణంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లోడంగి శ్రవణ్ కుమార్ తెలిపారు.శనివారం చిట్యాలలోని కామ్రేడ్ ఎండి అక్బర్ నివాసంలో నిర్వహించిన సీపీఐ చిట్యాల పట్టణ శాఖ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశం పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా లోడంగి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఐ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పాలన కోసం సీపీఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్తో పాటు నాయకులు బొలుగూరి లింగయ్య, దేశగాని బాలరాజు, రామలింగయ్య, రావుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి