Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:03 AM

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
March 20, 2026 06:41 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారిశుద్ధ్యం, పన్ను వసూళ్లపై కట్టుదిట్టమైన చర్యలు

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

శుక్రవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన–మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, మురుగు కాలువల శుభ్రత, వీధి కుక్కల నియంత్రణ, పార్కుల పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ, మార్కెట్ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

పారిశుద్ధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ, పారవేతలో సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100 శాతం వసూళ్లు సాధించాలని, నిర్దిష్ట గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్లకు సూచించారు.

మున్సిపల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News