Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 20, 2026 08:27 PM

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
March 20, 2026 06:41 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పారిశుద్ధ్యం, పన్ను వసూళ్లపై కట్టుదిట్టమైన చర్యలు

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

శుక్రవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన–మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, మురుగు కాలువల శుభ్రత, వీధి కుక్కల నియంత్రణ, పార్కుల పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ, మార్కెట్ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

పారిశుద్ధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ, పారవేతలో సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100 శాతం వసూళ్లు సాధించాలని, నిర్దిష్ట గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్లకు సూచించారు.

మున్సిపల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News