మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు
Krishna
సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, మహమ్మద్ రహమత్, సీమా సుల్తానలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని, నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మమత రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికైన సభ్యులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. కోఆప్షన్ సభ్యులు తమపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి