Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:01 AM

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు
02-05-2026 449 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, మహమ్మద్ రహమత్, సీమా సుల్తానలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని, నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మమత రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికైన సభ్యులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. కోఆప్షన్ సభ్యులు తమపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు

Article Image

సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, మహమ్మద్ రహమత్, సీమా సుల్తానలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని, నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మమత రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికైన సభ్యులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. కోఆప్షన్ సభ్యులు తమపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News