Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి
March 24, 2026 09:22 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

మున్సిపల్ కాట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఆలోపు కనీస వేతనం 26,000 అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు

       మంగళవారం చలో హైదరాబాద్ వెళ్తున్న మున్సిపల్ కార్మికుల వాహనాల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పారిశుధ్య పనులు నిర్వహిస్తూ పట్టణాలు పరిశుభ్రంగా చేస్తూ అవార్డులు రావడానికి కృషి చేస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపకుండా చాలీచాలని వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించు కుంటున్నారని ఆరోపించారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన అదనపు భారాలు పడుతూ అవస్థలు పడుతున్న కార్మికులకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కూడా నేటికీ అనేక మునిసిపాలిటీలలో అమలు జరగడం లేదని అన్నారు. కొన్ని మున్సిపాలిటీలలో మూడు నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని జీతాలు లేకుండా పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26,000 పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

         ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అనురాధ, యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ , వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పందుల లింగయ్య చిక్కుళ్ళ రాములు కాటపల్లి శ్రావణ్ కుమార్ ,జీడిమెట్ల నరసింహ, నక్క సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News