Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్రినిటీ విద్యాసంస్థల ఎదుట ‘ఎస్ఎఫ్‌ఐ’ ధర్నా ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 10:12 PM

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
January 28, 2026 06:42 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జోనల్ అధికారుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

స్థానికం ప్రతినిధి

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, వీడియో సర్వైలెన్స్ టీములు, వ్యయ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, సిబ్బందినియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని, ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు.ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు పరిమితిని తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించడం వ్యయ పరిశీలకుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డబ్బు, బహుమతులు, మద్యం వంటి వాటి అక్రమ పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీములతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచి, అవసరమైతే తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి ఫిర్యాదులపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ కే సీతారామారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెళ్లిళ్లకు సంబంధించిన వారు, ఆస్పత్రులకు వెళ్లే వారి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. నగదు, మద్యం పట్టుబడిన సందర్భాల్లోతప్పనిసరిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరణ చేయాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, వ్యయ పరిశీలకుల నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్, మాస్టర్ ట్రైనర్ రమేష్, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వ్యయ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News