మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తానే అభివృద్ధి సాధ్యమవుతుంది
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు అభ్యర్థి బొలిశెట్టి రాము అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ పట్టణంలోని 5వ వార్డ్ లో గురువారం విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, ఓటు వేసి ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమైందని, ప్రజలు ఈసారి తనకు మద్దతు తెలపాలని కోరారు. అవార్డు ప్రజలు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి