Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో
February 09, 2026 03:11 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థుల విజయానికి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. మళ్లీ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News