మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో
మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో
Biksham
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థుల విజయానికి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. మళ్లీ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి