Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:11 AM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి గడపగడప ప్రచారం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి గడపగడప ప్రచారం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి గడపగడప ప్రచారం
January 18, 2026 11:18 AM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మునిసిపాలిటీ పరిధిలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ఈడుదల మల్లేష్ ఆధ్వర్యంలో 5వ వార్డులో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి, బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ‘అమృత్’, ‘స్వచ్ఛ భారత్’ వంటి పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, అదే ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కబాలపల్లి సతీష్, సీనియర్ నాయకులు పల్లె వెంకన్న గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, నీలం మధు, నీలం నరేష్, పాల రవి వర్మ, బెల్లి నరేష్, కన్నె బోయన మురళితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News