Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:15 AM

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు
March 18, 2026 05:59 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ రంగంపై వచ్చిన వార్తల ప్రభావంతో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి క్రాప్ బుకింగ్, డిజిటల్ పంట నమోదు, రైతు రిజిస్ట్రీ ప్రక్రియలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న మునగ పంటను పరిశీలించిన కలెక్టర్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం అధిక దిగుబడి ఇచ్చే పంటగా మునగను అభివర్ణించారు. మునగ ఆకుల్లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా డిమాండ్ ఉందని తెలిపారు.

ఈ తరహా యూనిట్లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు వరి పంటకు బదులుగా వాణిజ్యపరమైన లాభాలు ఇచ్చే మునగ పంటను సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు.

తదుపరి ఆయిల్ పామ్ నర్సరీలు, క్షేత్రాలను పరిశీలించి, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ పథకాన్ని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. అలాగే భువనగిరిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించి ఆధునిక పద్ధతులు అవలంబించాలని అన్నారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి పీ.వీ. రమణ రెడ్డి, ఉద్యాన అధికారి మాధవి, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News