ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు
ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు
Biksham
జిల్లాకేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య నేతృత్వంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం పలువురు యువ జర్నలిస్టులకు సభ్యత్వ రసీదులు అందజేశారు.ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తూ పలు మండలాల అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
ఏళ్ల తరబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జర్నలిస్టులు తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల మంజూరులో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల మండల అధ్యక్షుడు కొంగల సతీష్, కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, నీరుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి