Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:03 PM

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు
13-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లాకేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య నేతృత్వంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం పలువురు యువ జర్నలిస్టులకు సభ్యత్వ రసీదులు అందజేశారు.ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తూ పలు మండలాల అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

ఏళ్ల తరబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జర్నలిస్టులు తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల మంజూరులో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల మండల అధ్యక్షుడు కొంగల సతీష్, కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, నీరుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

Article Image

జిల్లాకేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య నేతృత్వంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం పలువురు యువ జర్నలిస్టులకు సభ్యత్వ రసీదులు అందజేశారు.ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తూ పలు మండలాల అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

ఏళ్ల తరబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జర్నలిస్టులు తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల మంజూరులో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల మండల అధ్యక్షుడు కొంగల సతీష్, కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, నీరుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News