Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి
January 20, 2026 02:05 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుతో, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూచనలతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితర బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌పై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడిన వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్‌లు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీఆర్ఎస్ పార్టీని దిమ్మెలు కూలగొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దిగజారడమేనని విమర్శించారు. తెలంగాణలో కనుమరుగైన టీడీపీ, చంద్రబాబుపై ప్రేమ వలకబోసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిన అక్కసుతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసే చర్యలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, అమరవాది శ్రవణ్, బుడిగా నవీన్ తదితరులు పాల్గొన్నారు.






మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News