రామన్నపేట: ఉత్కంఠభరితంగా సాగిన రామన్నపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎండి మజీద్ మూడోసారి ఘన విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య ఎన్నికయ్యారు.
విస్తృత ప్రచారం అనంతరం జరిగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతు పొంది ఇద్దరూ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.
ఇతర పదవుల్లో ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి బాలరాజు, సహాయ కార్యదర్శిగా దినేష్, కోశాధికారిగా కూనూరు శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, లేడీ రిప్రెసెంటేటివ్గా రోసమ్మ థామస్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా పాల్వంచ జగతయ్య, సోమ సతీష్ రెడ్డి, సయ్యద్ అజిజుద్దీన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యేళ్ల శ్రీశైలం ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి