Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 07:45 PM

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం
March 22, 2026 06:17 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణ నియామకం

మోతే: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లపల్లి శివకృష్ణ, తనను గుర్తించి మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమితి బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో సమితి విస్తరణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాల ఏర్పాటు చేపడతానన్నారు.తన నియామకానికి సహకరించిన జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ కి, జిల్లా నాయకులు పిడమర్తి సైదులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News