Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:34 PM

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం
March 22, 2026 06:17 PM 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణ నియామకం

మోతే: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లపల్లి శివకృష్ణ, తనను గుర్తించి మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమితి బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో సమితి విస్తరణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాల ఏర్పాటు చేపడతానన్నారు.తన నియామకానికి సహకరించిన జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ కి, జిల్లా నాయకులు పిడమర్తి సైదులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News