మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
Sthanikam District Staff Reporter
ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత
మోటకొండూరు:స్థానికం మండల రిపోర్టర్
యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటకొండూరు మండల లబ్ధిదారులు మోటకొండూరు గ్రామానికి చెందిన మాల్గు నవీన్,వంగపల్లి లావణ్య,భావండ్లపల్లి వెంకటేష్,వంగపల్లి సురేష్,భూబండ్ల యాదయ్య,చామాపూర్ గ్రామానికి చెందిన మస్తేరు దాసరి తేజ మనోహర్ రెడ్డి,ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మి,అమ్మనబోలు గ్రామానికి చెందిన మాటూరు చంద్రమ్మ,తెర్యల గ్రామానికి చెందిన బి.శంకర్,నాంచారి పేట గ్రామానికి చెందిన మేడి రోజా,బి.పాండు చారి అనంతరం యాదగిరిగుట్ట,రాజాపేట,తుర్కపల్లి,బొమ్మలరామారం,గుండాల,ఆత్మకూర్ మండల ప్రాంత గ్రామాల లబ్ధిదారుల చెక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి