Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:25 PM

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా సరస్వతి అమ్మవారికి వైభవోపేత పూజలు
February 13, 2026 03:09 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాకతీయుల కాలం నాటి పిల్లలమర్రి శివాలయాల్లో భక్తుల రద్దీ

మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన 12వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి పిల్లలమర్రి శివాలయాలు లో పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి.ఉదయం వేళ శ్రీ సరస్వతి అమ్మవారు వారికి విశేష అభిషేకం నిర్వహించారు.

అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తదుపరి శ్రీ చక్ర దేవత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు సమూహంగా కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాల్లో ప్రతి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వైభవం, చారిత్రక ప్రాధాన్యత భక్తులను ఆకర్షిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News