Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:05 AM

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్
26-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.

మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్‌కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

Sthanikam

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

Article Image

మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.

మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్‌కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News