Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్
March 26, 2026 08:38 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.

మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్‌కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News