Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:24 PM

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్
March 26, 2026 08:38 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.

మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్‌కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News