మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్
మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్
Editor Desk
మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.
మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.
మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి