PRINT TIME: March 23, 2026 02:37 AM
మోహినాబాద్లో బారసాల వేడుకలు ఘనంగా
మోహినాబాద్లో బారసాల వేడుకలు ఘనంగా
March 23, 2026 12:49 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
చిన్నారిని ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్, ప్రముఖులు పాల్గొన్నారు
హైదరాబాద్: నగరానికి సమీపంలోని మోహినాబాద్ ఫామ్ హౌస్లో టి ఆంజనేయులు కుటుంబానికి చెందిన మనవరాలి బారసాల మహోత్సవం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేసి ఇలాంటి శుభకార్యాలు ఇంటింటా ఆనందాన్ని నింపుతాయని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి