మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Biksham
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొండోని రాయి తాండ గ్రామంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేజ నాయక్, డిప్యూటీ సర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ అభ్యున్నతికి కలిసికట్టుగా కృషి చేయాలని గ్రామ నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూజీ బాబు నాయక్, రూప్లా నాయక్, దేశయ్య నాయక్, రవి నాయక్, రాములు నాయక్, నార్య నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, నినావత్ శంకర్ నాయక్, కుమార్ నాయక్, బాబు నాయక్, నెహ్రూ నాయక్, హన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి