Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:15 PM

మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
02-06-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొండోని రాయి తాండ గ్రామంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేజ నాయక్, డిప్యూటీ సర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ అభ్యున్నతికి కలిసికట్టుగా కృషి చేయాలని గ్రామ నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూజీ బాబు నాయక్, రూప్లా నాయక్, దేశయ్య నాయక్, రవి నాయక్, రాములు నాయక్, నార్య నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, నినావత్ శంకర్ నాయక్, కుమార్ నాయక్, బాబు నాయక్, నెహ్రూ నాయక్, హన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మొండోని రాయి తాండలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొండోని రాయి తాండ గ్రామంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేజ నాయక్, డిప్యూటీ సర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ అభ్యున్నతికి కలిసికట్టుగా కృషి చేయాలని గ్రామ నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూజీ బాబు నాయక్, రూప్లా నాయక్, దేశయ్య నాయక్, రవి నాయక్, రాములు నాయక్, నార్య నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, నినావత్ శంకర్ నాయక్, కుమార్ నాయక్, బాబు నాయక్, నెహ్రూ నాయక్, హన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News