Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:02 PM

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
12-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులకు పూర్తి మద్దతు – సన్నరకం ధాన్యానికి అదనపు బోనస్

చివ్వెంల మండలంలోని మోదిన్‌పురం గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, శుభ్రపరిచే యంత్రాలు, తూకం పరికరాలు, కవర్లు, గన్నె సంచులు కొరత లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

సన్నరకం ధాన్యానికి అదనంగా ప్రతి క్వింటాలుకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రేడ్ ఏ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమశాతం తగ్గించి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాలలోనే అమ్మాలని రైతులను కోరారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా ధాన్యాన్ని దశల వారీగా కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగరపు సునీత ప్రసాద్, ఉప సర్పంచ్ కాకి శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛత్రు నాయక్, ఏలుగూరి వీరయ్య, పందిరి మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిదల వెంకన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Article Image

రైతులకు పూర్తి మద్దతు – సన్నరకం ధాన్యానికి అదనపు బోనస్

చివ్వెంల మండలంలోని మోదిన్‌పురం గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, శుభ్రపరిచే యంత్రాలు, తూకం పరికరాలు, కవర్లు, గన్నె సంచులు కొరత లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

సన్నరకం ధాన్యానికి అదనంగా ప్రతి క్వింటాలుకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రేడ్ ఏ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమశాతం తగ్గించి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాలలోనే అమ్మాలని రైతులను కోరారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా ధాన్యాన్ని దశల వారీగా కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగరపు సునీత ప్రసాద్, ఉప సర్పంచ్ కాకి శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛత్రు నాయక్, ఏలుగూరి వీరయ్య, పందిరి మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిదల వెంకన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News