మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోంది: వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపణలు!
మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోంది: వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపణలు!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ, మార్చి 25: కేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పూర్తిగా నాశనం చేయడానికి కుట్రలు పన్నుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తీవ్రంగా ఆరోపించారు. VB-G RAM G పథకాన్ని తీసుకురావడం దీని భాగమేనని ఆయన అన్నారు. బుధవారం నల్లగొండమండలం ముషంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీల సమస్యలు తెలుసుకున్నారు.
నారిఐలయ్య మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఏళ్ల తొడవాత పోరాడి 2005లో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం 2014 నుంచి బడ్జెట్కోతలు, ఆంక్షలతో నిర్వీర్యం చేస్తోంది" అని విమర్శించారు. 2026-27 బడ్జెట్లో MGNREGAకు ₹30,000 కోట్లకు మాత్రమే కేటాయింపు (గతేట 88,000 కోట్ల నుంచి తగ్గింపు), VB-G RAM Gకు ₹95,692 కోట్లు కేటాయించడం ద్వారా పాత చట్టాన్ని భర్తీ చేయాలని కుట్ర అని ఆరోపించారు.
కార్మికుల సమస్యలు తీవ్రం: ముషంపల్లి గ్రామంలో కూలీలు పని డిమాండ్ చేసినా 100-150 రూపాయల కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని, ఆగమించడం లేదని ఫిర్యాదులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యాంత్రీకరణ వల్ల వ్యవసాయ పనులు తగ్గడంతో కార్మికులు పట్టణాలకు వలసలు వెళ్తున్నారని ఐలయ్య అన్నారు. తెలంగాణలో 53.5 లక్షల జాబ్ కార్డులు, 1.2 కోట్ల మంది నమోదు, కానీ 10%కి పనులు కల్పించలేకపోతున్నారని తెలిపారు.
ఐలయ్యమాటల్లో, "పని చూపించాలంటే ఆంక్షలు, పని చేస్తే తక్కువ కూలీ. రోజువారీలు 125-200 రోజులకు పెంచాలి, కూలీ ₹800కు పెంచాలి. మున్సిపాలిటీల్లోనూ పథకం విస్తరించాలి" అని డిమాండ్లు చేశారు. VB-G RAM G బిల్లు MGNREGAను రీప్లేస్ చేస్తూ 125 రోజుల పని, కానీ రాష్ట్రాలు 40% ఖర్చు భరించాల్సి వస్తుందని, ఇది కేంద్ర బాధ్యతను తప్పించుకోవడమేనని విమర్శించారు.
పోరాట తీర్మానాలు: ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలి, VB-G RAM G బిల్లు వద్దు. ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేయాలి. అధికార యంత్రాంగం జిల్లాలో అందరికీపనులు కల్పించాలి. ఈ డిమాండ్లపై ఐక్య పోరాటం చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్నవారు: మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, గ్రామ అధ్యక్షులు ఇరుగు నరసమ్మ, వంటేద్దు రాణి, కార్యదర్శి బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శి బక్కతట్ల సంధ్య, ప్రచార కార్యదర్శి భారీ లింగయ్య, కోశాధికారి నామా రేణుక, గ్రామ నాయకులు రావుల కోమలి, లింగమ్మ, బైరెడ్డి నాగమణి, మలిరెడ్డి లక్ష్మమ్మ, తోకల మంగమ్మ, వట్టి పెద్దిరెడ్డి, కారింగు అనిత, నకిరేకంటి రాధిక, నోముల భవాని తదితరులు పాల్గొన్నారు.
నారిఐలయ్య మాటలు ప్రజల్లో ఆవేదన కలిగించాయి. ఉపాధి హామీ రాజ్యాంగ హక్కు (ఆర్టికల్ 41)ను కాపాడాలంటే మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కుల, మత దుర్వినియోగాలతో పేదలను మరింతదుర్బలపరచడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ పోరాటం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందని సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి