Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:42 PM

మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన డా. ఆఫీస్ ఖాన్

మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన డా. ఆఫీస్ ఖాన్

మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన డా. ఆఫీస్ ఖాన్
March 21, 2026 10:02 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని, దాని వల్ల ముస్లింలు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ ఆఫీస్ ఖాన్ మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News