Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:19 AM

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు
March 14, 2026 03:57 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చనుబండలో రూ.80 లక్షల సిమెంట్ రోడ్ పనులకు శ్రీకారం –

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి సారథ్యంలో నూజివీడు నియోజకవర్గం, ముఖ్యంగా చాట్రాయి మండలం వేగంగా అభివృద్ధి చెందుతోందని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి పార్థసారథి మంజూరు చేసిన ఈ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను మోరంపూడి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సారథి సహకారంతో మరో ఏడాదిలో చనుబండ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రావెల్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసిన మంత్రి పార్థసారథికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సహాయకురాలు దివ్య, గవర వెంకటేశ్వరరావు, శెట్టి నాగరాజు, దేశిన చెన్నారావు, గజవెల్లి వెంకటేశ్వరరావు, భారత వెంకటేశ్వరరావు, చిల్లపల్లి చెన్నారావు, వీరయ్య, బొట్టు దుర్గారావు, కందుల రమేష్, కందుల చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News