మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.
మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.
స్థానికం బృందం
వంద పడకల ఆస్పత్రి హామీ వచ్చేదాకా దీక్ష విరమణ లేదు
సీపీఐ(ఎం) నేత జల్లెల పెంటయ్య హెచ్చరిక
మీడియా మిత్రుల సంఘీభావం
రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు నిరవధిక నిరాహార దీక్షలను విరమించేది లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టినా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రి స్థాయి పెంపు, నూతన భవన నిర్మాణం కోసం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని ఆయన తెలిపారు.
మూడో రోజు దీక్ష సందర్భంగా మండల పాత్రికేయులు స్వచ్ఛందంగా దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఏటల్లి శ్రీనివాస్, బూరుగు వెంకటేశం, కొండ మల్లేశం గౌడ్, కేవి సుధాకర్ రాజు, లవణం ఉపేందర్, జినుకుల శ్రీనివాస్, కైరం కొండ సంతోష్, మాండ్ర సత్యనారాయణ , బొడ్డు పరశురాం తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి