Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:30 PM

మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.

మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.

మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.
March 18, 2026 08:50 AM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంద పడకల ఆస్పత్రి హామీ వచ్చేదాకా దీక్ష విరమణ లేదు

సీపీఐ(ఎం) నేత జల్లెల పెంటయ్య హెచ్చరిక

మీడియా మిత్రుల సంఘీభావం

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు నిరవధిక నిరాహార దీక్షలను విరమించేది లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టినా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రి స్థాయి పెంపు, నూతన భవన నిర్మాణం కోసం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని ఆయన తెలిపారు.

మూడో రోజు దీక్ష సందర్భంగా మండల పాత్రికేయులు స్వచ్ఛందంగా దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఏటల్లి శ్రీనివాస్, బూరుగు వెంకటేశం, కొండ మల్లేశం గౌడ్, కేవి సుధాకర్ రాజు, లవణం ఉపేందర్, జినుకుల శ్రీనివాస్, కైరం కొండ సంతోష్, మాండ్ర సత్యనారాయణ , బొడ్డు పరశురాం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News