హైదరాబాద్,
మేడిపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన “యాదాద్రి హాస్పిటల్”ను నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి హాస్పిటల్ ద్వారా మేడిపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఏపూరి సోమన్న, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి